15, జూన్ 2012, శుక్రవారం

చిరునామా రాయని ఉత్తరం...

ఆకాశంలో మేఘాలు తన ఊహలన్ని నా ఒడిలో నింపిందేమొ .. వాటికి నా కలలనే రంగులు వేస్తె నీ చిరునవ్వు అయిందేమో...అందుకే నీ నవ్వుపై అంత మక్కువ. నిన్ను చూస్తె ఆకాశంలో ఇంద్రదనుస్సులా అనిపిస్తుంది..వర్షం వచ్చినపుడు వస్తుందా, వర్షం వస్తేనే కనిపిస్తుందా ఇంద్రధనస్సుఅంటే ఏమని సమాధానం చెపుతాం చెప్పు. అందులో నిజము అబద్దము రెండు ఉన్నాయేమో లేక అంతా అబద్దమేమో లేక ఇది అంతా ఒక కల్పన ఏమో ..ఎలా చెప్పగలం.

అలానే నువ్వు నాతోనే ఉన్నావా లేక నాలోనే ఉన్నావా ..కాదు నాలాగే ఉన్నావా .. అంటే చెప్పడం కష్టం.. నీవు వస్తే చిరుజల్లు కురిసినట్టు..నాతో ఉంటే జడివానాలో తడిసినట్టు .. ఆ తాకిడికి నేను నిలవలేనేమో అనే ఒక తలపు నన్ను ఎక్కడో మనసుపొరల్లో గుచ్చుతుంది.. వెళ్ళమనే నోటి మాటా, దాచుకోవాలన్న మనసు ఊహ,  నేను మేఘమై నిన్ను నాలో నింపుకొని, కొండకోనల్లోకి వెళ్ళాలనే ఆశ..

నా  దగ్గర  ఉన్నపుడు, దూరంగా వెళితే బాగుండనే కోరిక, దూరంగా ఉన్నపుడు ఒకసారి వస్తే బాగుండనే ఆశ, రమ్మని అడగాలి అని పెదవి అంచువరకు వస్తుంది ,కానీ మనసు ఆశపడిందని నాకోసం నేను చేయలేను కొన్ని, నీ చుట్టూ పొదలా ఉండాలనుకుంటా.. ఇంకో నీడ కూడా నీ మీద పడనంతగా, ఒకసారి విరజాజి తీగల తాకి తాగకుండా అల్లుకోవాలని కోరిక, మరోసారి అందరు మెచ్చని మర్రి చెట్టునై నీకు నీడనివ్వాలన్న పేరాశ, గులాబి మీద మంచుబిందువుగా ఉండిపోవాలని మదిలోని ఊహ.

నా అరచేతిలో ...మదిలో...ఆలోచనలో...ఊహలో..కలలో..కవితలో..నా నీడలో, అద్దంలో , కనిపించే చందమామలో, కనిపించని కలువలో నువ్వు ఉంటే....నువ్వే ఉంటే...నువ్వు మాత్రమే ఉంటే..... అంతే చెప్పడానికి మాటలు రావడం లేదు.... పదాలు అందడం లేదు....

4, జూన్ 2012, సోమవారం

ప్రాణమిచ్చిన ఏనుగులు

ఎన్నో కథలు చదువుతూ ఉంటారు, ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటారు..ఎపుడో ఒకప్పుడు ఇలా వినే ఉంటారు..నాకు ఎలాంటి సినిమా చూసినా, కథ చదివినా  ఏడుపు అనేదే రాదండి..అవన్ని నటన, అది కథ  అని తెలిసి ఎలా వస్తుందో అనడం.. ఇలా చెప్పేవాళ్ళు ఎంత నిజం చెప్పారో నాకు తెలియదు కానీ జీవితంలో కంట నీరు పెట్టని మనిషి అంటూ ఉండరు అన్నది మాత్రం అక్షరసత్యం.

కొన్ని సంఘటనలు మన జీవితంలో ఎపుడో జరిగిపోయినవి అయినా వాటి తాలూకు జ్ఞాపకాన్ని వేరొకరితో పంచుకునేప్పుడు అపుడు పడిన బాధ తాలూకు నొప్పి..  నలుసంత అయినా తాకి నలిగిపోతుంది మనసు..అది చాలు మన కంటనీరు కదలడానికి.. అలానే యదార్ధగాధలు చదివినపుడు కొన్నిటికి స్పందనే కరువవుతుంది..మరి కొన్ని మనకే జరిగినట్టుగా అనిపించి తల్లడిల్లుతాము....

ఇలా చదువుతూ మరీ చేపుతారండి...నేను మాత్రం ఏడుపు అంటే ఏంటో మర్చిపోయానూ అని నవ్వేవాళ్ళు ఉండొచ్చు... అబ్బే అవన్ని మరీ మంచివాళ్ళు , పిరికివాళ్ళు చేసే పనులండి...నాలాంటి దుర్మార్గుడికి, కఠినాత్ముడిని ఏడిపించడం దేవుడి తరం కూడా కాదు అని ఒక్క మాటలో తెల్చిపడేసేవారు ఉండొచ్చు.

అసలు కథ చదివి ఎందుకు బాధపడతారు, మది భారమే కన్నీరుకి కారణం,మది ఎందుకు తల్లడిల్లుతుంది.... ప్రతీ మనిషి కి దయ జాలి అన్నది మనసు అరలో ఉంటుంది వాళ్ళు ఎంత కౄరులైనా... అందరి బాధలకు స్పందించకపోవచ్చు...అలా అని ఎవరి బాధకు స్పందించరు అనడం తగదు..కొన్ని కథలు అందరి మనసులని కదిలిస్తాయి..అందుకు మనిషి మనస్తత్వంతో పనిలేకుండా మనసుని తాకుతాయి.. కొన్ని కథలు, కొన్ని సంఘటనలు ఒకే మనిషి ఎన్ని సార్లు ఐనా ఏడిపించగలవు. ఎందుకంటే అవి మనసునే కాదు వారి అంతరంగాన్ని కూడా తడిముతుంది కాబట్టి..

అలాంటి ఒక కథనే మీకు పరిచయం చేస్తున్నాను ..ఎంతటి రాతి హృదయం అని చెప్పుకున్న కంట నీరు తాకకుండా, మనసు భారం కాకుండా కథ పూర్తి చేయలేరు...అలా చేసామని చెప్పినా నమ్మడం అసాధ్యం అని ఈ కథ చదివి మీరే అంటారు...
 
 ప్రాణమిచ్చిన ఏనుగులు

జపాన్ లోని యూనో జంతుశాలలో చెర్రీ చెట్లు చాలా ఉన్నాయి. ఈ కాలంలో చెర్రీ చెట్లు గులాబి రంగు పూలతో నిండుగా మనసును దోచుకుంటాయి. పూలరేకులు ఎండకు మెరుస్తున్నాయి. గాలి అలలకు పూలు జలజలా రాలుతున్నాయి. ఈ రోజు శెలవు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. జంతుశాలకు చాలా ఎక్కువ సంఖ్యలో చూసేవాళ్ళు వస్తున్నారు.

లోపల రెండు పెద్ద ఏనుగులు ఉన్నాయి. చూపరులకు కనువిందు చేసేలా అవి రకరకాల విన్యాసాలు చేస్తూన్నాయి. ఏనుగులు పెద్ద చెక్క దూలాల మీద పడిపోకుండా నిలబడి తొండంతో బూరలు ఊదుతున్నాయి.

ఇక్కడికి కొంచెం దూరంలో రాళ్ళతో ఒక సమాధి ఉంది. టోక్యోలోని యూనో జంతుశాలలో చపబడిన జంతువులకు గుర్తుగా ఆ సమాధి కట్టారు. జంతుశాలకు వచ్చే సందర్శకుల దృష్టి సాధారణంగా దీని మీద పడదు.ఒక రోజున నేను జంతుశాలకు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఈ రాతిస్మారక చిహ్నాన్ని ఎంతో ప్రేమతో తుడుస్తున్నాడు. అతడు చెప్పిన మూడు ఏనుగుల కథనే నేను మీకు మళ్ళీ చెబుతున్నాను.

ఈనాడు జంతుశాలకు వచ్చే వాళ్ళను వినోదపరచడానికి మూడు ఏనుగులు ఉన్నాయి.అయితే చాలా సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ మూడు ఏనుగులు ఉండేవి. వాటి పేర్లు జాన్, టోకీ, వైన్లీ. అది రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నా రోజులు, జపాన్ కూడా ఈ యుద్దంలో పాల్గొంటుంది. జపానులో రోజూ ఎక్కడో ఒక చోట బాబులు పడేవి. ఒక్కొక్క రోజైతే బాంబులు వర్షం మాదిరి కురిసేవి.

ఏదైనా బాంబు జంతుశాల మీద పడితే ఏ ఆపద ముంచుకొస్తుందో ఏమో? జంతువుల బోను విరిగిపోవచ్చు. అప్పుడు ప్రమాదకర జంతువులూ తప్పించుకుని నగరంలో జోరబడవచ్చు. అప్పుడు అంటా భయం గుప్పిట బందీలవుతారు. ఈ ముప్పునుంచి తప్పించుకోటానికి అన్నీ ప్రమాదకర జంతువులను విషమిచ్చి చంపేయమని సైన్యం ఆదేశాలు ఇచ్చింది. సింహాలు, చిరుతపులులు, తోడేళ్ళు, ఎలుగుబంట్లు, పెద్ద పెద్ద పాములు - ఇలా ఒకటి తరువాత ఒకటి విషమిచ్చి చంపేశారు .

ఇక మూడు పెద్ద ఏనుగులు మిగిలాయి......for more click....ప్రాణమిచ్చిన ఏనుగులు